తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న టీఆర్ఎస్ను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చడమే తన లక్ష్యమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ ప్రజలు అందించిన విజయం అసాధారణమైందన్నారు. తెలంగాణ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానంటూ ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ తనకు అప్పగించిన గురుతర బాధ్యతను మహోన్నత ఆశయంగా భావిస్తున్నట్టు ప్రకటించారు.తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే కేంద్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామన్నారు కేటీఆర్. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ఇందులో తామే నిర్ణయాత్మక శక్తిగా ఉంటామంటూ ధీమా వ్యక్తం చేశారు.