కొండా దంపతుల విమర్శలను కేటీఆర్ తిప్పికొట్టారు. కొండా సురేఖ, మురళి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయడం సహజమేనని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. కొండా దంపతులు తనపై, పార్టీపై చేసిన ఆరోపణలపై పరోక్ష విమర్శలు చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయే వారు పోతూ పోతూ రాళ్లు వేయడం సహజమేనని అన్నారు. టీఆర్ఎస్పై విమర్శలు చేసి అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఎవరికి ఎంత బలం ఉందో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.