డిసెంబర్ 11న తర్వాత రాహుల్ గాంధీ వీణ..చంద్రబాబు ఫిడేల్ వాయించుకోవాల్సిందే
డిసెంబర్ 11 తర్వాత.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిడేలు వాయించుకోవాలని మంత్రి కేటీఆర్ విమర్శించారు.. కూకట్పల్లిలో సీమాంధ్రులతో కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్.. 70 యేళ్లలో ఎన్నడూ లేని విధంగా నగరంలో శాంతియుత వాతావరణం నెలకొందని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రికార్డును సృష్టించామన్న కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్రులు టీఆర్ఎస్కు మద్దతిచ్చారని తెలిపారు.. ఇక తెలంగాణ వస్తే సీమాంధ్రులను తరిమేస్తారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని కేటీఆర్ తెలిపారు.