197 ఓట్ల మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి

Update: 2018-12-11 07:15 GMT

అతి తక్కువ ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్‌.. తన సమీప ప్రత్యర్థిపై కేవలం 197 ఓట్లమెజార్టీతో గెలుపొందారు. ఈ స్థానంలో మహాకూటమి తరపున అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గట్టిపోటీనిచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల, వర్దన్నపేట, కంటోన్మెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ 89 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుండగా, మహాకూటమి 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అలాగే బీజేపీ నాలుగు, మజ్లిస్ పార్టీ ఐదు, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు.

Similar News