పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలి: విశ్వేశ్వర్ రెడ్డి 

Update: 2018-12-10 17:54 GMT

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు అప్పుడే బేరాలు మొదలుపెట్టారని ఆరోపణలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు. టీఆర్‌ఎస్‌ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డే తనకు ఫోన్‌ చేశారన్నారు. మర్రి జనార్ధన్‌ రెడ్డి పిచ్చి పిచ్చి ఆరోపణలు మానుకోవాలని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో అమ్ముడుపోయే గుణము మర్రిజనార్ధన్ రెడ్డిదని ప్రశ్నించారు. జనార్ధన ఖచ్చితంగా ఓడిపోతననే భయంతోనే నాపై ఆరోపణలు చేస్తూన్నరని ఎద్దేవా చేశారు. తనకు సుమారు 50 మంది టీఆర్‌ఎస్‌ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Similar News