ఎమ్మెల్యే కొండ సురేఖకు అవమానం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లాలో జరిగిన హరితహారంలో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను అధికారులు వేదికపైకి పిలవలేదు. సాక్షాత్తు డిప్యూటి సీఎం కడియం శ్రీహరి పాల్గొన్న సభలోనే తనను వేదికపైకి పిలవకపోడంతో కొండా సురేఖ తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. కార్యక్రమం జరుగుతుండగానే మధ్యలో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి కడియం కొండా సురేఖకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.