పరకాల నియోజకవర్గం మహాకూటమి అభ్యర్థి, కాంగ్రెస్ నేత కొండా సురేఖ వెనుకంజలో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి సురేఖపై 6,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ నుంచి టికెట్ను ఆశించిన భంగపడ్డ సురేఖ తిరిగి సొంతగూటి(కాంగ్రెస్)కి చేరుకుని పరకాల నుంచి టికెట్ పొందిన విషయం తెలిసిందే.