రాజకీయ, నైతిక విలువలకు కట్టుబడే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు కొండా మురళి. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిచిన ఘనత తనదేనన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తమకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమన్న ఆయన తమ రాజకీయ శత్రవు ఎర్రబెల్లి దయాకర్ను టీఆర్ఎస్లో చేర్చుకోవడంతోనే పార్టీని వీడామన్నారు.