తెలంగాణ ప్రజల తీర్పు ప్రజాకూటమికి అనుకూలంగా ఉండబోతుందని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 70 నంచి 80 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నేషనల్ ఛానెల్స్ చేస్తున్న సర్వేలకు విశ్వసనీయత లేదని కోమటిరెడ్డి అన్నారు. గత 15 సంవత్సరాలుగా లగడపాటి సర్వేలు చేస్తున్నారని తెలంగాణ ఎన్నికలపై లగడపాటి చేపట్టిన సర్వేలో విశ్వసనీయత ఉందని అన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. టీఆర్ఎస్ చిల్లర రాజకీయాలను నల్లగొండ ప్రజలు నమ్మలేదన్నారు. నకిరేకల్లో చిరుమర్తి, మునుగోడులో రాజగోపాల్రెడ్డి గెలుస్తారని అన్నారు. ప్రజాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు చేస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు.