గెలిచేవారికే తొలి జాబితాలో టికెట్లు వచ్చాయి

Update: 2018-11-13 05:19 GMT

కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాపై ఆ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. తొలి జాబితాలో గెలిచేవారికి టికెట్లు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రకటించిన తొమ్మిది స్థానాలలో కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపటి నుంచి ప్రచారం ముమ్మరంగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సభలతో కొత్త జోష్‌ తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు.
 

Similar News