నా అనుచరులను ఇబ్బంది పెట్టొద్దని టీఆర్‌ఎస్‌‌ను కోరుతున్నా

Update: 2018-12-12 12:39 GMT

ప్రజా తీర్పును గౌరవించి ఓటమిని స్వీకరిస్తున్నట్లు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజలను డబ్బుతో ప్రలోభాలకు గురిచేశారన్న కోమటిరెడ్డి పదవి లేకున్నా ప్రజలకు సేవ చేస్తానన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని ఎవరికి ఏ సమస్య వచ్చినా అండగా ఉంటానంటా భరోసా ఇచ్చారు. తన అనుచరులను ఇబ్బంది పెట్టొద్దని అధికార పార్టీ నేతలను కోరారు. అయితే నల్గొండను కేసీఆర్‌‌ దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి‌. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి అభినందనలు తెలిపారు. తన పదవీకాలంలో జిల్లాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఏర్పాటుకు, తాగు- సాగునీటి సమస్యల నివారణకు కృషి చేశాననని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అభివృద్ధిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
 

Similar News