చంద్రబాబు ట్రాప్‌లో పడొద్దు...ఉత్తమ్ తీరుపై టీజేఎస్ అసంతృప్తి

Update: 2018-10-25 07:21 GMT

మహాకూటమిలో లుకలుకలు, సీట్ల కేటాయింపులో నిత్య వాయిదాల నేపధ్యంలో భవిష్యత్‌పై టీజేఎస్ దృష్టి సారించింది. పార్టీ అగ్రనేతలతో అధ్యక్షుడు కోదండరామ్ చర్చలు జరిపారు.  పొత్తుల విషయంలో తేల్చక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేతలు కాంగ్రెస్‌ను చంద్రబాబే నడిపిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ అధినేతకు సూచించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా ఉందామన్న నేతలు టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగితే సహించేది లేదని తేల్చిచెప్పారు.

Similar News