ప్రెస్మీట్లో కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని వెలువరించారు. అసెంబ్లీ రద్దు చేసిన రోజే 105 మంది అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నామన్నారు. అభ్యర్థులందరితో క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు. బాబూమోహన్కు షాక్ ఇచ్చారు కేసీఆర్. ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. బాబుమోహన్ స్థానంలో టీఆర్ఎస్ టిక్కెట్ ను జర్నలిస్టు క్రాంతి కిరణ్ కు ప్రకటించారు. బాబుమోహన్ పై వ్యతిరేకత ఎక్కువగా ఉండటం, కాంగ్రెస్ తరుపున బలమైన అభ్యర్థిగా దామోదర రాజనర్సింహ్మ ఉండటంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.