సంగారెడ్డి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా రాజీనామా చేసిన కాసాల బుచ్చిరెడ్డి ఎట్టకేలకు శుక్రవారం ఆపధర్మ మంత్రి హరీశ్రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకున్నారు. బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. మూప్పై ఏళ్లుగా బీజేపీ పార్టీలో పని చేసి పార్టీని వీడడం చాలా బాధాకరంగా ఉందన్నారు. కార్యకర్తలు, ప్రజలకు సహాయం, సేవ చేయాలన్న లక్ష్యంతోనే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బుచ్చిరెడ్డి స్పష్ఠం చేశారు.స్వతహాగా రైతుబిడ్డనైన నేను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సాగుకు పెట్టుబడి సాయం, రైతుబంధు పథకం, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా వంటి పథకాలకు నేను మంత్రముగ్ధునైయ్యానని బుచ్చి వెల్లడించారు.