కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్తో సాగించిన బేరసారాల సీడీని.. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. బీసీ పాటిల్ను వెనక్కి రావాలని.. వస్తే కేబినేట్ ర్యాంక్ ఇస్తానని ఆడియోలో యడ్యూరప్ప ఆఫర్ చేశారు. తన దగ్గర ముగ్గురు ఎమ్మెల్యేలున్నారని పాటిల్ చెప్పగా.. అందరినీ తీసుకురావాలని.. యడ్యూరప్ప కోరినట్లు.. కాంగ్రెస్ విడుదల చేసిన సీడీ.. సంచలనం సృష్టిస్తోంది.