కర్నాటకలో మూడు లోక్సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. బళ్లారి, శివమొగ్గ, మాండ్య లోక్సభ స్థానాలతోపాటు రామనగర, జమ్ఖండి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి కుమారస్వామి సతీమణి అనిత పోటీ చేస్తుండటంతో ఉపఎన్నిక పోరు రసవత్తరంగా మారింది.