మిడ్ మానేరు గేట్లు ఎత్తివేత...వాగునీటిలో చిక్కుకున్న ట్రాక్టర్, ఇద్దరు వ్యక్తులు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పొత్తూరు దగ్గర్లోని మిడ్ మానేరు గేట్లు ఎత్తేయడంతో వాగులో ట్రాక్టర్ చిక్కుకుపోయింది. ఒక్కసారిగా మిడ్ మానేరు గేట్లు ఎత్తడంతో ట్రాక్టర్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహం మధ్య చిక్కుకుపోయారు. దీంతో అక్కడే ఉన్న స్థానికులు నీటిలోకి దిగి వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వాగులో ఉన్న బోర్లను తొలగించేందుకు తాము దిగామని మిడ్ మానేరు గేట్లు ఎత్తుతారనే విషయం తెలియదంటున్నారు. అయతే స్థానికులు సకాలంలో స్పందించడంతో ప్రాణాలు దక్కాయని చెబుతున్నారు.