మధ్యప్రదేశ్ 18వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కమల్నాథ్ పీఠాన్ని అధిష్టించనున్నారు. సుదీర్ఘ మంతనాల తర్వాత పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కమల్ నాథ్వైపే మొగ్గు చూపారు. దీంతో కమల్ నాథ్కు లైన్ క్లియర్ అయింది. మధ్యప్రదేశ్లో 230 స్థానాలుండగా కాంగ్రెస్ 114 చోట్ల, బీజేపీ 109, బీఎస్పీ 2, సమాజ్వాదీ పార్టీ 1, ఇతరులు 4 చోట్ల విజయం సాధించారు. అధికారం చేపట్టాలంటే 116 సీట్లు రావాలి. దీంతో మాయావతి కాంగ్రెస్తో జత కలిసేందుకు సిద్ధమయ్యారు. అలాగే సమాజ్వాది పార్టీ కూడా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.