అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తేవాలనుకుంటే మేం దానికి మద్దతివ్వమని బీజేపీ మిత్రపక్షం, బిహార్ అధికార పార్టీ జనతాదళ్(యూ) స్పష్టం చేసింది. రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ నైనా సమర్ధించేదే లేదని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. అయితే రామ మందిరం నిర్మాణ విషయాన్ని తీసుకరాకుండానే వచ్చే ఏడాది 2019 లోకసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించే సత్తా బీజేపీ ఉందని అభిప్రాయపడింది. మేనిఫెస్టోలో చెప్పినట్టుగానే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టి తీరుతామని బీజేపీ స్పష్టం చేసింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపాకు భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయంపై ప్రశాంత్ కిశోర్ స్పందిస్తూ ఈ ఫలితాలు భాజపాను అంతగా ఆందోళనకు గురిచేసేవి కావని అన్నారు.