కానిస్టేబుల్ ను కిడ్నాప్ చేసి దారుణంగా చంపిన ఉగ్రవాదులు!

Update: 2018-07-06 04:53 GMT

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. సోఫియాన్‌ జిల్లాలోని ఖచ్‌దోరాలో కానిస్టేబుల్‌ జావేద్‌ అహ్మద్‌ దార్‌ను కిడ్నాప్‌ చేసి దారుణంగా హత్య చేశారు. కానిస్టేబుల్‌ను నిన్న కిడ్నాప్‌ చేసిన ఉగ్రవాదులు... చంపేసి గ్రామ శివార్లలో శవాన్ని పడేసి వెళ్లారు.‎ దారుణంగా హింసించి ... కాల్చి చంపారు. శరీరాన్ని బులెట్లతో చీల్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు... పోస్ట్‌‌మార్టం అనంతరం గౌరవ వందనం సమర్పించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పంగించారు.

Similar News