కోడి కత్తి దాడి కేసులో సిట్ నోటీసులకు వైసీపీ అధినేత జగన్ గడువు కోరారు. విశాఖ ఎయిర్పోర్టు జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి వాగ్మూలం ఇవ్వాలంటూ జగన్కు సిట్ నోటీసులు పంపడంతో ఆయన సమయం కావాలని కోరారు. ఈ మేరకు జగన్ రాసిన లేఖను విశాఖకు చెందిన వైసీపీ నేతలు సిట్కు అందచేశారు. కోడి కత్తి దాడి కేసును థర్డ్ పార్టీతో దర్యాప్తు చేయించాలంటూ తాను దాఖలు చేసిన రిట్ పిటిషన్ను ఈ నెల 27న హైకోర్టు విచారించబోతోందని న్యాయస్థానం నిర్ణయం వెలువడిన తర్వాత వాంగ్మూలం ఇస్తానని జగన్ తెలిపారు. కోర్టుల పట్ల తనకు అపార గౌరవం ఉందన్న జగన్ వాటి నిర్ణయాన్ని తప్పక పాటిస్తానని సిట్కు రాసిన లేఖలో తెలిపారు.