ప్రస్తుతం కులాంతర వివాహాలు చేసుకున్నవారు భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడులు చేస్తారో అని వణికిపోతున్నారు. మిర్యాలగూడ, ఎర్రగడ్డ తర్వాత హైదరాబాద్ సంతోష్ నగర్ పీఎస్ పరిధిలోని రక్షపురానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి నిన్న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. శ్రీకాంత్ను హుటాహుటిన ఉస్మానియాకు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. 2015 లో శ్రీకాంత్ కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే అమ్మాయి తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్కు చెందిన ఉద్యోగి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించాడు. తాజాగా అమ్మాయిని బలవంతంగా తన నుంచి లాక్కెళ్లడంతో మనస్థాపం చెందిన శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రాణాలు తీసుకునే ముందు ఆయన సెల్ఫీ వీడియో తీసుకుని తన ఆవేదనను చెప్పుకున్నాడు.