కంగారూ గడ్డపై ఖతర్నాక్‌ సిరీస్‌

Update: 2018-11-20 10:02 GMT

ధూమ్ ధామ్ టీ-20 లో మరో అతిపెద్ద సిరీస్ కు...కంగారూగడ్డపై రంగం సిద్ధమయ్యింది. మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా...బ్రిస్బేన్ గబ్బా స్టేడియం వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే... తొలి టీ-20 సమరంలో...రెండో ర్యాంకర్ టీమిండియాకు...మూడో ర్యాంకర్ ఆస్ట్రేలియా సవాలు విసురుతోంది. ఏడాది నిషేధం కారణంగా కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ జట్టుకు దూరం కావడంతో కంగారూ టీమ్ బలహీన పడింది. దీంతో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని టీమిండియా హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, కొహ్లీ, రిషభ్ పంత్, బుమ్రా, కుల్దీప్ యాదవ్
లాంటి ఆటగాళ్లతో మెన్ ఇన్ బ్లూ అత్యంత సమతూకంతో, పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు డాషింగ్ ఓపెనర్ ఆరోన్ ఫించ్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టులో...అలెక్స్ కారీ, ఆస్టన్ అగర్, జేసన్ బెహెన్ డ్రోఫ్, నేథన్ కౌంటర్ నైల్, క్రిస్ లిన్, గ్లెన్ మాక్స్ వెల్, బెన్ మెక్ డెర్మాట్, డీ ఆర్కే షార్ట్, బిల్లీ స్టాన్ లేక్, మార్కుస్ స్టోయినిస్, యాండ్రూ టై, ఆడం జంపా సభ్యులుగా ఉన్నారు.
 

Similar News