తెలంగాణలో ఘన విజయం సాధించిన కేసీఆర్ ఇక ఢిల్లీపై కన్నేశారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. త్వరలోనే ఢిల్లీ వెళ్తానని చెప్పిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతున్నట్టు ప్రకటించారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్యేతర ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ రావాల్సిన ఆవశ్యకతను కేసీఆర్ వివరించారు. ఇందుకోసం ఎంఐఎం అధినేత అసదుద్దీన్తో కలిసి దేశవ్యాప్తంగా పర్యటించనున్నట్టు కేసీఆర్ ప్రకటించారు.