కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఒరిజినల్ సీసీ ఫుటేజ్ సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది. ఎన్నికల నోటిఫికేషన్పై వారంపాటు స్టే విధిస్తే అభ్యంతరమా అని ఈసీని కూడా కోర్టు ప్రశ్నించింది. దీనిపై సాయంత్రం మూడున్నరకు తమ నిర్ణయాన్ని తెలుపుతామని ఈసీ కోర్టుకు తెలిపింది.