పెద్దమనసు చాటుకున్నా సూపర్ స్టార్ రజినీ..

Update: 2018-11-20 11:59 GMT

గత కొద్దిరోజులుగా ‘గజ’ తుఫాను తమిళనాడులోని దక్షిణ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. కాగా గజ తుఫాను బాధితులను ఆదుకునేందుకు ప్రముఖసినీ తారాలు సైతం మేమున్నమంటూ ముందుకు వస్తున్నారు. తాజాగా సూర్యకుటుంబం, జీవి ప్రకాశ్ తదితరులు తమ వంతు బాధ్యతగా సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ముందుకొచ్చారు. తుఫాను బాథితులకు నేనున్నఅంటు సాయంకింద రూ. 50 లక్షల రూపాయలు ప్రకటించి రజినీ తన పెద్దమనసును మరోసారి నిరూపించుకున్నాడు. రజీనితోపాటు దర్శకుడు శంకర్ కూడా రూ.10లక్షల రూపాయలు ప్రకటించారు. 

Similar News