కేటీఆర్ పనితీరుపై హరీశ్రావు ప్రశంసలు గుప్పించారు. హైదరాబాద్లో సిరిసిల్ల నియోజకవర్గ కీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్రావులు పాల్గొన్నారు.. ఆత్మహత్యల సిరిసిల్ల, సిరుల ఖిల్లాగా మారిందంటే.. పూర్తి క్రెడిట్ కేటీఆర్దేనని పొగడ్తలు గుప్పించారు. అభివృద్ధి విషయంలో మాత్రం కేటీఆర్, తాను పోటీ పడతామని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు సాగాలని హరీశ్ తెలిపారు. మెజారిటీ విషయంలో సిరిసిల్ల సిద్దిపేటను దాటాలని కార్యకర్తలకు సూచించారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి హరీష్ రావు కి కేటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. తాము కేవలం అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని తెలిపారు. తాము సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామన్నారు. ఉద్యమ కాలం నుంచి కేవలం తెలంగాణ కోసం పనిచేసిన తాము, ఇద్దరం కలిసి ఇలా ఒకే క్యాబినెట్లో పనిచేసే అవకాశం లభించిందని... ఇదంతా తెలంగాణ ప్రజలు తమకు ఇచ్చిన ఒక సువర్ణవకాశంగా భావిస్తున్నామన్నారు. మోజారిటీ విషయంలో సిద్దిపేటను దాటలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.