అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి లోని ఓ బ్యాంక్లో గుర్తుతెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన ఫైరింగ్ లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన వారిని దగ్గర్లోనిఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్పులుకు పాల్పడిన ఒమర్ పెరాజ్ను పోలీసులు మట్టుపెట్టారు.