ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడితే, మొబైల్స్ పేలిపోతున్న సంఘటనలు ఇటీవల తరచూ జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ ఫోన్కు ఛార్జింగ్ పెట్టే మాట్లాడుతూనే ఉన్నారు. ఇదే మాదిరిగా ఒడిశాలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఒడిశాలో జర్సుగుడ జిల్లాలో లైకెరా పోలీసు స్టేషన్ పరిధిలో 18 ఏళ్ల యువతి మొబైల్ ఛార్జింగ్ పెట్టి, ఫోన్ మాట్లాడుతుండగా దాన్ని బ్యాటరీ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. మృతురాలు ఉమా ఓరమ్గా సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఛార్జింగ్లో ఉండగానే ఉమా.. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతోంది. ఆ సమయంలో అకస్మాత్తుగా భారీ శబ్దంతో ఫోన్ బ్యాటరీ పేలిపోయింది. దీంతో ఆమె ఛాతికి, కాలుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో ఉమా స్పృహ తప్పిపడిపోయింది. వెంటనే జిల్లా హెడ్క్వార్టర్స్లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్టు ధృవీకరించారు డాక్టర్లు. ఆ సెల్ ఫోన్ నోకియా మోడల్ అని తెలిసింది.