గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిని టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గులాబీ పార్టీ అభియోగాలు మోపింది. గజ్వేల్ నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపిన పార్టీ కేంద్ర కార్యాయలం నర్సారెడ్డిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది.