సోనియా గాంధీ స్పీచ్‌కు పలుమార్లు అంతరాయం

Update: 2017-12-16 08:12 GMT

రాహుల్ గాంధీ పట్టాభిషేకం సభలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ప్రసంగానికి టపాసుల మోత పలుమార్లు అంతరాయం కలిగించింది. టపాసుల శబ్దానికి ఆమె మూడుసార్లు ప్రసంగం నిలిపివేశారు. సేవాదళ్ కార్యకర్తలు టపాసులు కాల్చడం నిలిపివేయాలని కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేశారు. అయినా టపాసుల మోత కొనసాగింది. కాసేపు ప్రసంగించి సోనియా గాంధీ మళ్లీ నిలిచిపోయారు. స్పీచ్ కొనసాగించామని ఓ కాంగ్రెస్ నేతతో పాటు రాహుల్ గాంధీ సోనియా గాంధీని కోరారు. టపాసుల శబ్దం మధ్యే సోనియా గాంధీ ప్రసంగం కొనసాగించారు. కాసేపటి తర్వాత టపాసుల మోత నిలిచిపోయింది. 

Similar News