బ్రహ్మం గారు చెప్పినట్లే జరిగింది. పంది కడుపున మనిషి జన్మించాడు.’ అనే నకిలీ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. పంది కడుపున మనిషి శిశువు జన్మించినట్లు చూపుతున్న ఫొటోలు పోస్టుకు జత చేసి నెటిజన్లు షేర్ చేసుకుంటున్నారు. అయితే, అవన్నీ తప్పుడు కథనాలు. సిలికాన్తో బొమ్మలను తయారు చేసే ఆర్టిస్ట్ మగానుకో లైరా అనే యువతి పంది రూపంలో ఉన్న మానవ శిశువును తయారు చేసింది. ప్రస్తుతానికి ఆమె పంది కడుపున మనిషి జన్మించినట్లు తయారు చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్ సమాజాన్ని భయబ్రాంతులకు గురి చేసే ఇలాంటి వార్తల్ని నమ్మకండి. కావాలంటే మగానుకో తయారు చేసిన బొమ్మల్ని మీరే చూడండి.