పాలేరులో తుమ్మల ఓటమి

Update: 2018-12-11 07:37 GMT

పాలేరులో తాజామాజీ మంత్రి, టీఆరెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందారు. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి కండల ఉపేందర్ రెడ్డి  గెలుపొందారు. మంథనిలో కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 12 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఈయనపై పుట్టా మధుకర్ గెలుపొందారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో  12 వేల ఓట్ల మెజారిటీతో సాయన్న గెలుపు. కోరుట్ల లో టీఆర్‌ఎస్ అభ్యర్థి విద్యాసాగర్ విజయం. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. ఇక ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుండటంతో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్ధుల్లా.. శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. 

Similar News