తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి మరోసారి పట్టం కట్టాయని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. మహాకూటమి ఆంధ్రామీడియాతో కలిసి టీఆర్ఎస్ను ఓడించాలని ఎంత ప్రయత్నించినా ప్రజలు మాత్రం కేసీఆర్ నాయకత్వానికే మద్దతు పలికారని తెలిపారు. మంత్రిపదవులు ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయమని దానిపై అప్పుడే తాను స్పందించబోనని ఈటల తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంకితభావంతో పని చేసే వారికి అవకాశం కల్పిస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.