కోడ్‌ ఉల్లంఘనపై విచారణకు ఈసీ ఆదేశం

Update: 2018-09-29 05:24 GMT

ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఈసీ విచారణకు ఆదేశించింది. డ్వాక్రా సంఘాలు ఏకగ్రీవంగా తీర్మాణం చేసి గెలిపిస్తే.. 5 లక్షలు ఇస్తామంటూ ఏనుగు రవీందర్ రెడ్డి చేసిన ప్రకటనపై ఈసీ దృష్టి సారించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత.. ఏనుగు రవీందర్ రెడ్డి ఇచ్చిన హామీ విషయంపై జిల్లా కలెక్టర్ ను వివరణ కోరినట్లు ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. కలెక్టర్ వివరణ ఇచ్చిన తర్వాత, కేంద్ర ఎన్నికల కమీషన్ కు పంపనున్నట్టు తెలిపారు. 
 

Similar News