దేశం చూపులన్నీ తెలంగాణ మీదనే తెలంగాణ రేపటితో ఎన్నికల రణరంగంలో విజేతలేవరో పరజీతులేవరో తెలిపోయే సమయం వచ్చేసింది. ఫలితాలు వెలుడనున్న నేపథ్యంలో కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్కుమార్ తెలిపారు. ఉదయం ఎనిమిదింటికి ఓట్ల లెక్కింపు ఆరంభం. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీటీవీ కెమెరాల నిగాహ్ లో 144 సెక్షన్ మధ్య ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. మొత్తం 2379 రౌండ్లలో లెక్కింపు జరుగుతుందని రేపు ఒంటి వరకు గెలుపోటముల సరళి వెల్లడయ్యే అవకాశం ఉందని తెలిపారు. బెల్లంపల్లిలో అత్యల్పంగా 15 రౌండ్ల కౌంటింగ్ ఉంటుందన్నారు.