ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన డాక్టర్

Update: 2018-07-25 11:23 GMT

ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్ పేషెంట్ జీవితంతో ఆడుకున్నాడు. ఏ వైద్యుడూ చేయని విధంగా ఆపరేషన్ మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో జరిగింది. ఆపరేషన్ మధ్యలో వదలేసిన డాక్టర్‌ను రోగి బంధువులు నిలదీసే ప్రయత్నం చేయగా ఆయన అక్కడ నుంచి జారుకున్నాడు. దీంతో వారు ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

పెదతాడేపల్లి వీకర్స్ కాలనీకి చెందిన పార్థసారథి కిడ్నీ వ్యాధితో మదర్ వన్నిని ఆసుపత్రిలో చేరాడు. కిడ్నీలో రాళ్ళు తొలగించేందుకు ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ కింద ఆపరేషన్ చేస్తామని కూడా తెలిపారు. తీరా సగం ఆపరేషన్ అయ్యాక కిడ్నీ‌లో స్టోన్ బాగా కిందకు ఉందని ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీలో కుదరదని డాక్టర్ మహేష్ తెలిపాడు. తనకు డబ్బులిస్తే రాయి తొలగిస్తానని మొండికేశాడు. సొమ్ములిచ్చుకోలేమని  పార్థసారధి బంధువులు చెప్పడంతో డాక్టర్ మహేష్ ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు. 

Similar News