మహాకూటమి పొత్తులపై మెత్తబడిన సీపీఐ

Update: 2018-11-13 05:27 GMT

మహాకూటమి పొత్తులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న సీపీఐ ఎట్టకేలకు మొత్తబడింది. కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నందున మూడు సీట్లకే పరిమితం కావాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఎన్నికల తరువాత అధికారంలో వస్తే సీపీఐకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని చెప్పడంతో  తాజా ప్రతిపాదనకు సీపీఐ నేతలు అంగీకరించారు. ఈ విషయాన్ని కాసేపట్లో  సీపీఐ కేంద్ర కమిటీ అధికారికంగా ప్రకటించనుంది. దీంతో పాటు పార్టీకి కేటాయించిన హుస్నాబాద్ నుంచి చాడ వెంకటరెడ్డి, వైరా నుంచి విజయలు పోటీ చేయనున్నారు. మరో స్ధానం బెల్లంపల్లి నుంచి పోటీ చేసే అభ్యర్ధిని నేడు ఖరారు చేయనున్నారు. 

Similar News