తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సంపత్కుమార్లు డీజీపీ మహేందర్రెడ్డితో సమావేశమయ్యారు. తమకు గన్మన్లను కేటాయించాలని వారు డీజీపీని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తమ శాసనసభ్యత్వాలను పునరుద్దరిస్తూ తీర్పు ఇచ్చినప్పటికీ ఇంతవరకు తమకు గన్మెన్లను కేటాయించలేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి పశువులను బాదినట్లు బాదుతున్నారని వారు డీజీపీకి వివరించారు. అలాగే తమకు ప్రాణహాని ఉందని, తమకు గన్మెన్లను కేటాయించాలని వారు డీజీపీని కోరారు.