ఆశావహులకు ఆజాద్‌ ఝలక్‌

Update: 2018-09-20 07:54 GMT

హైదరాబాద్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్ లీడర్‌ గులాం నబీ ఆజాద్‌ను ఆ పార్టీ ఆశావహులు చుట్టుముట్టారు. గాంధీభవన్‌కు వచ్చిన ఆయన్ను టిక్కెట్లు తమకే ఇవ్వాలంటూ ఆయనకు దగ్గరగా వచ్చి అడగడంతో ఆజాద్‌ ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. దీంతో తన దగ్గరకు వచ్చిన వారితో టిక్కెట్లు ఇంత త్వరగా ఇవ్వడం కుదరదని చెప్పారు. టిక్కెట్ల కోసం కాదు ముందు పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే గుర్తించి టిక్కెట్లిస్తామన్నారు. గాంధీభవన్‌ చుట్టూ తిరగడం కాదని ముందుగా నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేయాలని ఆయన సూచించారు. 

Similar News