నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి స్పందించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ వారసుల కోసం తండ్రులు పడుతున్న ఆరాటమేనని అన్నారు. కవిత కోసం కేసీఆర్ తాపత్రయపడుతుంటే, కొడుకుల కోసం డీఎస్ ఆరాటపడుతున్నారని అన్నారు. ముందస్తులు ఎన్నికలు వస్తున్నాయనే కేసీఆర్కు విజయవాడలో అమ్మవారు గుర్తుకొచ్చారని ఎద్దేవ చేశారు. కాంగ్రెస్లో బీసీలకు జరిగిన అవమానాలపై మాట్లాడిన దానం నాగేందర్... ఇప్పుడు డీఎస్కి జరిగిన అవమానంపై స్పందించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.