దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోంది

Update: 2018-12-08 10:08 GMT

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభంజనం వీస్తుందన్నారు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్. ఇటీవల ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎన్ని ఇబ్బందులు, ప్రలోభాలు పెట్టినా ప్రజలు మాత్రం ఓటింగ్ లో పాల్గొన్నారని తెలిపారు. మేడ్చల్ లో సోనియా సభ తరువాత రాష్ట్రంలో సీన్ మారిపోయిందన్నారు మధుయాష్కీ గౌడ్. కాంగ్రెస్‌ ఎప్పుడూ సర్వేలను విశ్వసించదని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల నాడి తమకు అనుకూలంగా ఉంది.. ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు. లగడపాటి తెలంగాణ విలన్‌ అన్న కేటీఆర్‌ ఆయనతో ఎందుకు చాటింగ్‌ చేశారని ప్రశ్నించారు. లగడపాటి సర్వే టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చినపుడు ఎగిరి గంతేయలేదా అని అడిగారు. ఇప్పుడు ఎందుకు ఆయనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
 

Similar News