భారత ప్రధాని నరేంద్రమోఢీపై మరోసారి విమర్శలు గుప్పించాడు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ. 99 శాతం వస్తువులను 18 శాతం, అంతకన్నా తక్కువ శాతాల శ్లాబుల్లోకి తీసుకురావాలని ఇటివల మోఢీ సర్కార్ వెల్లడించిన విషయం తెలిసిందే కాగా ఈ విషయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ మొత్తానికి మోఢీని నిద్ర మత్తు నుంచి లేపగలిగాం అంటూ రాహుల్ ఎద్దేవా చేశారు. జీఎస్టీ (గబ్బర్ సింగ్ ట్యాక్స్)పై గాఢ నిద్రలో ఉన్న ప్రధానమోఢీజీని ఎట్టకేలకు లేపగలిగాం అని అన్నారు. అసలే చేయకపోవడం కంటే ఆలస్యంగానైనా చేయడం మంచిదే నరేంద్ర జీ..!’ అని ట్వీట్ ద్వారా రాహుల్ గాంధీ విమర్శించారు.