ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళన

Update: 2018-11-11 11:58 GMT

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. టికెట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ తెలంగాణభవన్‌వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట దళిత నేతలు ఆందోళన చేపట్టారు. ప్యారాచూట్‌ నేతలకు సీట్లు కేటాయించొద్దని, పార్టీని నమ్ముకుని ఎన్నోఏళ్లుగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని అన్నారు. నిన్నమొన్న పార్టీలోకి వచ్చినవారికి టికెట్లు ఇవ్వాలని చూస్తున్నారని, అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత పాటించడంలేదని దళిత నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

Similar News