ఎన్నికల ప్రచారానికి ఒక రోజు విరామం ఇచ్చిన సీఎం కేసీఆర్ నేటి నుంచి మరోసారి ప్రచార బరిలోకి దిగనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి పోటీ చేస్తున్న తాండూరుతో పాటు పరిగి, నారాయణ పేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నంలలో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొనున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.