అగ్నిప్రమాదం ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Update: 2018-07-04 09:22 GMT

వరంగల్‌ భద్రకాళి ఫైర్‌ వర్క్స్‌‌ అగ్నిప్రమాదంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం.. ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అగ్నిప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అగ్నిప్రమాదం ఘటనలో 10 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే.

Similar News