టీఆర్ఎస్ గెలవాల్సింది 88 కాదని, 106 సీట్లన్నారు సీఎం కేసీఆర్. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కేసీఆర్ చిన్న చిన్న లోపాల వల్లే కొన్ని సీట్లు కోల్పోయామని తెలిపారు. తనతో పాటు మరొకరు ప్రమాణం చేస్తారని చెప్పారు. ఇప్పటివరకు అసెంబ్లీలో తానే సీనియర్నని తన తర్వాత రెడ్యానాయక్, దయాకర్రావు సీనియర్లని కేసీఆర్ అన్నారు. ఖమ్మంలో తమ పార్టీ అంతర్గత విబేధాల వల్లే ఓడిపోయామని పేర్కొన్నారు. గెలిచిన వాళ్లే కాదు గెలవని వాళ్లు కూడా తనకు ముఖ్యమేనని స్పష్టం చేశారు. గెలవని వాళ్లను కూడా కలవాలి వాళ్లతో మాట్లాడాలి అని కేసీఆర్ చెప్పారు. తమ పార్టీలో ఇంకా చాలా మంది చేరబోతున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.