ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ లోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మలక్పేట, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాల్లో ఆయన రోడ్ షోలు, సభలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. మధ్నాహ్నం ఒంట గంట 30 నిమిషాల నుంచి చంద్రబాబు నివాసం నుంచి రోడ్ షో ప్రారంభమై మలక్ పేటలో ముగుస్తుంది. ఆ తర్వాత మూడు నియోజకవర్గాల్లోని వివిధ చోట్ల సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు ఈసీఐఎల్ ఎక్స్రోడ్ లో రోడ్ షో, సభతో చంద్రబాబు ప్రచారం ముగిస్తారు.