డాన్సులు, హంగామాలు ఇలాంటివన్నీ ఏ ఫంక్షన్లలోనో, పెళ్లిళ్లలోనూ జరుగుతుంటాయి. కానీ మధ్యప్రదేశ్లోని స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యాలయంలో కజ్రారే కజ్రారే... అనుకుంటూ చిందులు వేశారు అక్కడి ఉద్యోగులు. ఆడ, మగ కలిసి పని చేయాల్సిన సమయంలో ఆటవిడుపుగా ఆటలాడారు, పాటపాడారు. ఇప్పుడీ వీడియో వైరల్గా మారింది. ఆన్ డ్యూటీలో ఉన్న అధికారులు పని వదిలేసి, పాటలు పాడుతున్నారేంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.