టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ పై మరో కేసు నమోదు అయింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో 41 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చిన పోలీసులు ఈరోజు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ వారంరోజులుగా పరారీలో ఉన్నాడు.